వల్లభాయ్పటేల్ను ఆదర్శంగా తీసుకోవాలి
ABN , First Publish Date - 2021-11-01T03:46:35+05:30 IST
నేటి యువత సర్దార్ వల్లభాయ్పటేల్ను ఆదర్శంగా తీసుకోవాలని ఒకటో పట్టణ ఎస్ఐ పవన్కుమార్ అన్నారు. వల్లభాయ్పటేల్ జయంతి సందర్భంగా గూడూరు పోలీసులు పట్టణంలో విద్యార్థులతో కలిసి రన్ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు.
![వల్లభాయ్పటేల్ను ఆదర్శంగా తీసుకోవాలి](https://media.andhrajyothy.com/appimg/galleries/1921103110145849/10312021221530n2.gif)
గూడూరు, అక్టోబరు 31: నేటి యువత సర్దార్ వల్లభాయ్పటేల్ను ఆదర్శంగా తీసుకోవాలని ఒకటో పట్టణ ఎస్ఐ పవన్కుమార్ అన్నారు. వల్లభాయ్పటేల్ జయంతి సందర్భంగా గూడూరు పోలీసులు పట్టణంలో విద్యార్థులతో కలిసి రన్ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ వల్లభాయ్పటేల్ ఐక్యభారత్ నిర్మాణానికి అలుపెరుగని కృషి చేశారన్నారు. దేశానికి ఉప ప్రధానిగా, హోంశాఖ మంత్రిగా విశిష్ట సేవలందించారన్నారు. కార్యక్రమంలో ఎస్ఐలు బ్రహ్మనాయుడు, గోపాల్, తిరుపతయ్య, అజయ్కుమార్, ముత్యాలరావు, ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు.