ప్రధాన కూడళ్లలో ఎన్టీఆర్ వర్ధంతి
ABN , First Publish Date - 2021-01-19T05:16:55+05:30 IST
నందమూరి తారక రామారావుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు ఘన నివాళులర్పించారు. సోమవారం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నగరంలోని ప్రధాన కూడళ్లలో చిత్రపటాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.
నెల్లూరు, జనవరి 18 (ఆంధ్రజ్యోతి) : నందమూరి తారక రామారావుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు ఘన నివాళులర్పించారు. సోమవారం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నగరంలోని ప్రధాన కూడళ్లలో చిత్రపటాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. 47వ డివిజన్లో ధర్మవరం సుబ్బారావు ఆధ్వర్యంలో, 27వ డివిజన్ జ్యోతి నగర్లో వలిపి దయాకర్ ఆధ్వర్యంలో, అల్లీపురంలో మేకల రామ్మూర్తి ఆధ్వర్యంలో, 26వ డివిజన్లో మాతంగి కృష్ణ ఆధ్వర్యంలో, 34వ డివిజన్లో మన్నెం పెంచలనాయుడు, దామినేని బుజ్జయ్యనాయుడు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో అజీజ్ పాల్గొని అన్నదానం చేశారు. 15వ డివిజన్లో ఆకుల హనుమంతురావు ఆధ్వర్యంలో, 7వ డివిజన్లో పెంచలనాయుడు ఆధ్వర్యంలో, రెండో పట్టణ పోలీసు స్టేషన్ సెంటర్లో రాజా ఆధ్వర్యంలో, అలంకార్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద అంగని ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్టీఆర్ వర్దంతి కార్యక్రమాల్లో కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పాల్గొని అన్నదానం నిర్వహించారు. టీడీపీ నాయకుడు ఆలూరు వెంకటేశ్వర్లు చౌదరి పేదలకు పండ్లు పంపిణీ చేశారు.
గుడిపల్లిపాడులో అన్నదానం
నెల్లూరు రూరల్, జనవరి 18 : ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా సోమవారం నెల్లూరు రూరల్ ప్రాంతం 2వ డివిజన్ గుడిపల్లిపాడులో టీడీపీ నేతలు పేదలకు అన్నదానం చేశారు. పార్టీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి అజీజ్ పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మేకల రామ్మూర్తి, అనిల్కుమార్, జెన్ని రమణయ్య, సుధాకర్, శైలజ, ఖాదర్బాషా పాల్గొన్నారు. మండలంలోని కలివెలపాళెంలో టీడీపీ నేత వెడిచర్ల వెంకటేశ్వర్లు యాదవ్ నేతృత్వంలో ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహించారు.