వచ్చే నెల 11న ఉపరాష్ట్రపతి రాక
ABN , First Publish Date - 2021-10-26T05:33:10+05:30 IST
వచ్చే నెల 11 నుంచి 15వ తేదీ వరకు భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు జిల్లాలో పర్యటించనున్నారు.
ఐదురోజులపాటు జిల్లాలోనే వెంకయ్య
ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్ష
నెల్లూరు(హరనాథపురం), అక్టోబరు 25 : వచ్చే నెల 11 నుంచి 15వ తేదీ వరకు భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ చక్రధర్బాబు సోమవారం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 5 రోజులపాటు ఉపరాష్ట్రపతి ఉంటారని, అందుకు తగ్గట్లు ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వెంకటాచలంలో జరిగే స్వర్ణభారత్ ట్రస్టు 20వ వార్షికోత్సవాలలో ఆయన పాల్గొంటారని తెలిపారు. వీపీఆర్ ఫంక్షన్ హాలులో జరిగే లాయర్ వారపత్రిక 40వ వార్షికోత్సవంలో ఉపరాష్ట్రపతి పాల్గొంటారని తెలిపారు. వెంకయ్యనాయుడుతోపాటు కేంద్రమంత్రులు కూడా జిల్లాకు వచ్చే అవకాశం ఉందన్నారు. పటిష్ట బందోబస్తుతోపాటు నగర సుందరీకరణ, పారిశుధ్యం పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఈ సమీక్షలో జేసీలు హరేందిరప్రసాద్, విదే్హఖరే, గణే్షకుమార్, రోజ్ మాండ్ తదితరులు పాల్గొన్నారు.