నెల్లూరు: 14 పంచాయతీలలో రీకౌంటింగ్ పరిశీలనకు ఈసీ ఆదేశాలు
ABN , First Publish Date - 2021-02-26T16:55:56+05:30 IST
జిల్లాలో పద్నాలుగు పంచాయతీలలో రీ కౌంటింగ్ పరిశీలించాలని జిల్లా కలెక్టర్కు ఎన్నికల్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.

నెల్లూరు: జిల్లాలో పద్నాలుగు పంచాయతీలలో రీ కౌంటింగ్ పరిశీలించాలని జిల్లా కలెక్టర్కు ఎన్నికల్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దుత్తలూరు పంచాయతీ ఓట్ల లెక్కింపులో బారీగా అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేయకుండానే ఫలితాలను ఎన్నికల అధికారి ప్రకటించారు. దీనిపై ఆందోళన చేసినప్పటికీ పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.