రైతాంగాన్ని తక్షణం ఆదుకోవాలి : ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2021-12-03T03:38:52+05:30 IST
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన ఉదయగిరి రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి కోరారు.
ఉదయగిరి, డిసెంబరు 2: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన ఉదయగిరి రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి కోరారు. గురువారం ఉదయగిరి రోడ్లు భవనాల శాఖ అతిఽథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని శాఖల మండల అఽధికారులతో చర్చించి పంట నష్టపోయిన రైతుల జాబితా సిద్ధం చేయాలని సూచించామన్నారు. రోడ్లు, చెరువులు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. నియోజకవర్గంలో నష్టన్ని జిల్లా కలెక్టరు చక్రధర్బాబు దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటనలో కలసి నష్టం వివరించి ఆదుకోవాలని కోరనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ అక్కి భాస్కర్రెడ్డి, జిల్లా కోఆప్షన్ సభ్యుడు తాజుద్ధీన్, చేజర్ల చలమారెడ్డి, వెంగళరెడ్డి, మూలె వీరారెడ్డి, ఓబులరెడ్డి, తిరుపతి, మట్ల లక్ష్మయ్య, రామయ్య, అక్కులరెడ్డి, వినయ్రెడ్డి, జబ్బార్ తదితరులు పాల్గొన్నారు.