మత్స్యకారుల సంక్షేమానికి కృషి
ABN , First Publish Date - 2021-04-13T03:50:58+05:30 IST
మత్స్యకారుల సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర మత్స్య, పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు.
ముత్తుకూరు, ఏప్రిల్12: మత్స్యకారుల సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర మత్స్య, పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. కృష్ణపట్నం ఆర్కాట్పాళెంలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచా రంలో ఆయన ప్రసంగించారు. మత్స్యకారుల కోసం కృష్ణపట్నం సమీపంలో ఫిషింగ్ జెట్టీ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గురుమూర్తిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్రావు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల జితేంద్రరెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రతాప్రెడ్డి, మండల కన్వీనర్ మెట్టా విష్ణువర్థన్రెడ్డి, నాయకులు రాగాల వెంకటేశ్వర్లు, నెల్లూరు శివప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
--------