మహిషాసురమర్దినిగా కన్యకాపరమేశ్వరి
ABN , First Publish Date - 2021-10-15T03:05:02+05:30 IST
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం ఆత్మకూరులోని వాసవీ కన్యకాపర మేశ్వరి ఆలయంలో అమ్మవారు
![మహిషాసురమర్దినిగా కన్యకాపరమేశ్వరి](https://media.andhrajyothy.com/appimg/galleries/1921101409322759/10142021213248n73.jpg)
ఆత్మకూరు, అక్టోబరు 14 : శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం ఆత్మకూరులోని వాసవీ కన్యకాపర మేశ్వరి ఆలయంలో అమ్మవారు మహిషాసురమర్దిని అలంకరణలో దర్శనమిచ్చారు. అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందచేశారు. శివాలయంలో అన్నపూర్ణాదేవి ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ పూజారి శివకుమార్శర్మ అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఉత్తర బలిజవీధిలో వెలసిన జ్వాలాముఖి ఆలయంలో మహిషాసురమర్ధిని అలంకరణలో అమ్మవారు శోభిల్లారు. తిరునాళ్ళతిప్పలోని కాశీనాయన ఆశ్రమ ఆవరణలో వెలసి ఉన్న జ్ఞానసరస్వతీదేవి, కనకదుర్గాదేవి ప్రత్యేక అలంకరణ లో భక్తులకు దర్శనమిచ్చారు.
------------------
ఉదయగిరిలో..
ఉదయగిరి రూరల్, అక్టోబరు 14: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్థానిక శివాలయంలో పార్వతీదేవి గురువారం మహిషాసురమర్ధిని అలంకరణలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు అఽధికసంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అర్చకులు అనిల్శర్మ భక్తులకు తీర్థప్రసా దాలు అందజేశారు.
వరికుంటపాడులో...
వరికుంటపాడు, అక్టోబరు 14: దసరా మహోత్సవాల్లో భాగంగా గురువారం మండలంలోని తూర్పురొంపిదొడ్ల గ్రామంలో వెలసి ఉన్న మానసాదేవి అమ్మవారు సిద్ధిధాత్రి అలంకరణలో దర్శనమిచ్చారు. అలాగే వరికుంటపాడులో వెలసి ఉన్న నాగార్పమ్మ అమ్మవారు మహిషాసుర మర్ధిని అలంకరణలో దర్శనమిచ్చారు.
కలిగిరిలో..
కలిగిరి, అక్టోబరు 14: మండలంలోని తెల్లపాడులో భద్రకాళిఅమ్మవారు గురువారం మహిషాసురమర్ధిని అలంకారంలో దర్శనమిచ్చారు. ఆలయంలో జరిగిన విశేష పూజాకార్యక్రమాలు, కుంకుమార్చనలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సాయంత్రం దీపోత్సవం నిర్వహించారు. దోర్నాల వెంకటరామ్మోహన్, చిలక సత్యనారాయణ కుటుంబసభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించినట్లు నిర్వాహుకులు జే వెంకటేశ్వర్లు(జేవీ) తెలిపారు.
![](https://media.andhrajyothy.com/appimg/galleries/1921101409322759/10142021213314n97.jpg)
![](https://media.andhrajyothy.com/appimg/galleries/1921101409322759/10142021213339n69.jpg)