లక్ష్యాలను పూర్తి చేయకపోతే సస్పెన్షన్ తప్పదు
ABN , First Publish Date - 2021-08-22T03:54:16+05:30 IST
ల్లాలో 46 మండలాల్లో 9.80 లక్షల మొక్కలను నాటడంలో భాగంగా, అన్ని మండలాలకు లక్ష్యాలు కేటాయించారని, ఈ లక్ష్యాలు సాధించడంలో నిర్లక్ష్యం చేస్తే , నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేస్తామని డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ తిరుపతయ్య హెచ్చరించారు.
![లక్ష్యాలను పూర్తి చేయకపోతే సస్పెన్షన్ తప్పదు](https://media.andhrajyothy.com/appimg/galleries/192108211022434/08212021222307n38.gif)
కోట, ఆగస్టు 21 : జిల్లాలో 46 మండలాల్లో 9.80 లక్షల మొక్కలను నాటడంలో భాగంగా, అన్ని మండలాలకు లక్ష్యాలు కేటాయించారని, ఈ లక్ష్యాలు సాధించడంలో నిర్లక్ష్యం చేస్తే , నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేస్తామని డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ తిరుపతయ్య హెచ్చరించారు. శని వారం కోటలోని ఉపాధి హామీ పథకం కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. క్షేత్ర సహాయకుల పనితీరును పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఈ నెలాఖరులోపు జిల్లాలో 5.50 లక్షల మొక్కలను నాటాలన్నారు. మొక్కలను తీసుకొని, నాటకుండా సాకులు చెబితే ఉపేక్షించేది లేదన్నారు. పంచాయతీల వారీగా మండలాల సిబ్బందికి కొన్ని పనులు కేటాయించామన్నారు. ఎంపీడీవో భవాని, ఏపీవో విజయమ్మ, టెక్నికల్ అసిస్టెంట్లు సుమన్, శాంతి, తదితరులు ఉన్నారు.