కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడి మృ
ABN , First Publish Date - 2021-08-11T03:19:05+05:30 IST
కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు విశ్వనాథం ఈశ్వరయ్య(61) సోమవారం రాత్రి మరణించారని రైతు కూలీ సంఘం జిల్లా స
![కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడి మృ](https://media.andhrajyothy.com/appimg/galleries/1921081009473223/08102021214749n57.jpg)
వెంకటగిరి(టౌన్), ఆగస్టు 10
: ప్రజాతంత్ర చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు విశ్వనాథం ఈశ్వరయ్య(61) సోమవారం రాత్రి మరణించారని రైతు కూలీ సంఘం జిల్లా సహాయక కార్యదర్శి వీవీ రమణయ్య తెలిపారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆయన చేసిన సేవలు మరువలేన్నారు. 2006లో చేనేత మజూరీల పెంపు కోసం వెంకటగిరిలో జరిగిన సమ్మెలో ఆయన సేవలు గుర్తింపు తెచ్చాయన్నారు. ఆయన మరణం తీరని లోటన్నారు. ఈ సందర్భంగా ప్రజాతంత్ర చేనేత కార్మిక సంఘం నాయకులు ఆయన మృతదేహానికి నివాళులు అర్పించారు.