జోగి రమేష్ దిష్టిబొమ్మ దహనం
ABN , First Publish Date - 2021-09-19T04:11:39+05:30 IST
చంద్రబాబునాయుడు ఇంటిపై దాడికి నిరసనగా శనివారం టీడీపీ నాయకులు గమళ్లపాళెంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద జోగి రమేష్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
గూడూరు, సెప్టెంబరు 18: చంద్రబాబునాయుడు ఇంటిపై దాడికి నిరసనగా శనివారం టీడీపీ నాయకులు గమళ్లపాళెంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద జోగి రమేష్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను తట్టుకోలేక వైసీపీ నాయకులు ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారన్నారు. కార్యక్రమంలో పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, వాటంబేడు శివకుమార్, మట్టం శ్రావణి, వెంకటేశ్వర్లురాజు, అబ్దుల్ రహీం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు