సమస్యలపై జనసేన రాజీలేని పోరాటం
ABN , First Publish Date - 2021-09-03T06:15:00+05:30 IST
జనసేనాని పవన్కళ్యాణ్ పిలుపు మేరకు సమస్యలపై రాజీలేని పోరాటం కొనసాగిస్తూ ప్రజలకు అండగా ఉంటామని జనసేన పార్టీ నియోజకవర్గ

ఆత్మకూరు, సెప్టెంబరు 2 : జనసేనాని పవన్కళ్యాణ్ పిలుపు మేరకు సమస్యలపై రాజీలేని పోరాటం కొనసాగిస్తూ ప్రజలకు అండగా ఉంటామని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ పేర్కొన్నారు. పవన్కళ్యాణ్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా చివరిరోజు కార్యక్రమంలో రహదారుల దుస్థితిపై నిరసన వ్యక్తం చేస్తూ జనసేన నేతలు, కార్యకర్తలు ఆత్మకూరు బైపా్సరోడ్డు మీద ధర్నా నిర్వహించారు. ముందుగా స్థానిక శ్రీధర్ గార్డెన్స్లో పవన్కళ్యాణ్ 50వ జన్మదిన వేడుకలను నిర్వ హించారు. మహిమలూరులో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్యదర్శులు బేతపూడి విజయ్కుమార్, కోలా విజయలక్ష్మి, కొట్టె వెంకటేశ్వర్లు, పూసల మల్లేశ్వరరావు పలువురు నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.