మూఢ నమ్మకాల నిర్మూలన చట్టం అమలు చేయాలి
ABN , First Publish Date - 2021-08-21T03:29:18+05:30 IST
తెలుగు రాష్ట్రాల్లో మూఢ నమ్మకాల నిర్మూలన చట్టాన్ని అమలు చేయాలని జేవీవీ పట్టణ అధ్యక్షుడు వేగూరు రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు.
![మూఢ నమ్మకాల నిర్మూలన చట్టం అమలు చేయాలి](https://media.andhrajyothy.com/appimg/galleries/1921082009572610/08202021215759n55.gif)
గూడూరురూరల్, ఆగస్టు 20: తెలుగు రాష్ట్రాల్లో మూఢ నమ్మకాల నిర్మూలన చట్టాన్ని అమలు చేయాలని జేవీవీ పట్టణ అధ్యక్షుడు వేగూరు రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక పాత బస్టాండు సమీపంలో జనవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో జాతీయ శాస్త్రీయ స్పృహ దినోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు ఈ చట్టాన్ని అమలు చేస్తున్నాయన్నారు. మూఢనమ్మకాల మత్తులో చదువుకున్నవారు కూడా కన్నబిడ్డలను చంపుతున్నారన్నారు. ఎంతో మంది దొంగస్వాములు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో చెంచునారాయణ, సాయికిరణ్, వెంకట్, అశోక్, గోపీ, ప్రభాకర్, మస్తాన్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.