ఆరోగ్యశ్రీలో అక్రమాలకు పాల్పడితే చర్యలు
ABN , First Publish Date - 2021-02-07T05:06:01+05:30 IST
ఆరోగ్యశ్రీలో అక్రమాలకు పాల్పడితే చర్యలు

ఆసుపత్రుల తనిఖీలో జేసీ ప్రభాకర్రెడ్డి
నెల్లూరు (వైద్యం)ఫిబ్రవరి 6 : వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య సేవల్లో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని జేసీ ప్రభాకర్రెడ్డి హెచ్చరించారు. శనివారం నెల్లూరులోని రిచ్ ఆసుపత్రి, మోడరన్ కంటి వైద్యశాలల్లో ఆయన తనిఖీ చేశారు. ఆరోగ్యశ్రీ అమలు అవుతున్న తీరు, రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యం ఎక్కడైనా పరీక్షల పేరుతో నగదు వసూలు చేస్తే ఆరోగ్య మిత్రలకు ఫిర్యాదు చేయాలన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందా లేదా పరిశీలించి సేవలు అందించాలని సూచించారు. రోగికు నాణ్యమైన వైద్య సేవలు అందించటంలో విఫలమైతే ఆరోగ్య మిత్రలను బాధ్యులను చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.