హెల్మెట్ ధారణ తప్పని సరి
ABN , First Publish Date - 2021-10-30T04:18:38+05:30 IST
ప్రతి ద్విచక్రవాహనదారుడు హెల్మెట్ ధరించి ప్రయాణించడం వల్ల ప్రమాదాల నుంచి సురక్షితంగా బయటపడవచ్చని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు.

ఎమ్మెల్యే కిలివేటి
నాయుడుపేట టౌన్, అక్టోబరు 29 : ప్రతి ద్విచక్రవాహనదారుడు హెల్మెట్ ధరించి ప్రయాణించడం వల్ల ప్రమాదాల నుంచి సురక్షితంగా బయటపడవచ్చని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, సీఐ సోమయ్య, కమిషనర్, పోలీసులు హెల్మెట్లు ధరించి శుక్రవారం ఆర్అండ్బీ అతిథిగృహం నుంచి పట్టణ పురవీధుల మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. అనంతరం సీఐ సోమయ్య మాట్లాడుతూ తప్పని సరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించినప్పుడే ఆ వ్యక్తితోపాటు అతని కుటుంబం అంతా సుఖసంతోషాలతో ఉంటుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లింగారెడ్డి చంద్రశేఖర్రెడ్డి, వైస్చైర్మన్ జలదంకి వెంకటకృష్ణారెడ్డి, నాయుడుపేట ఎస్ఐ కృష్ణారెడ్డి, వైసీపీ నాయకులు కలికి మాధవరెడ్డి, కటకం జయరామయ్య, పొట్లపూడి రాజేష్, మోహన్, చంద్రారెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, పోలీసు సిబ్బంది ఉన్నారు.