కరోనాతో హెడ్ నర్సు మృతి
ABN , First Publish Date - 2021-05-14T03:57:13+05:30 IST
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి హెడ్నర్సు హెలెన్ కరోనాతో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందారు.

నెల్లూరు(వైద్యం) మే 13 : ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి హెడ్నర్సు హెలెన్ కరోనాతో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందారు. ఆమె మృతికి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు సతీష్ కుమార్ తీవ్ర సంతాపాన్ని తెలిపారు. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వ రూ. 50 లక్షల పరిహాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా బాధితులకు 15 రోజులు సేవలు అందించిన వైద్య సిబ్బందికి 15 రోజులు సెలవులు ఇవ్వాలని కోరారు.