చేనేత కార్మికులకు అండగా నిలవాలి
ABN , First Publish Date - 2021-03-02T05:21:33+05:30 IST
ప్రజలంతా చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి నేత కార్మికులను ప్రోత్సహించాలని జాయింట్ కలెక్టర్ హరేందిర ప్రసాద్ పిలుపునిచ్చారు.
చేనేత వస్త్ర ప్రదర్శన ప్రారంభోత్సవంలో జేసీ హరేందిరప్రసాద్
నెల్లూరు(వ్యవసాయం), మార్చి 1 : ప్రజలంతా చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి నేత కార్మికులను ప్రోత్సహించాలని జాయింట్ కలెక్టర్ హరేందిర ప్రసాద్ పిలుపునిచ్చారు. నెల్లూరులోని మహేశ్వరి పరమేశ్వరి కల్యాణ మండపంలో సోమవారం చేనేత-జౌళిశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వస్త్ర ప్రదర్శనను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. చేతితో రూపొందించిన వస్ర్తాలు చేనేత కార్మికుల ప్రతిభకు నిదర్శనమన్నారు. చేనేత జౌళి శాఖ ఏడీ ఉమామహేశ్వరి మాట్లాడుతూ ఈ ప్రదర్శన ఈనెల 14వతేదీ వరకు ఉంటుందని చెప్పారు. ఏపీ నుంచే కాకుండా తెలంగాణ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్కి చెందిన 50 చేనేత సంఘాలు ఈప్రదర్శనలో పాల్గొంటున్నాయన్నారు.