కర్ఫ్యూ అమలుకు పటిష్ట చర్యలు
ABN , First Publish Date - 2021-05-08T05:11:38+05:30 IST
కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ పకడ్భందీగా అమలుకు అనంతసాగరం పోలీసులు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 12
అనంతసాగరం, మే 7: కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ పకడ్భందీగా అమలుకు అనంతసాగరం పోలీసులు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 12 తరువాత ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను అరికట్టేలా అనంతసాగరం కేఫ్ సెంటర్లో ప్రత్యేక చెక్పోస్టు ఏర్పాటు చేశారు. ఎస్ఐ ప్రభాకర్ సిబ్బందితో గస్తీ నిర్వహి స్తున్నారు. అనవసరంగా బయట తిరగకుండా ప్రభుత్వ సూచనలు పాటించాలని కోరుతున్నారు.