నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
ABN , First Publish Date - 2021-05-09T03:25:04+05:30 IST
మండలంలో రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిబంధనలను ప్రజలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఎస్ఐ మరిడినాయుడు హెచ్చరించారు.

ఉదయగిరి, మే 8: మండలంలో రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిబంధనలను ప్రజలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఎస్ఐ మరిడినాయుడు హెచ్చరించారు. శనివారం నాల్గోరోజు ఉదయగిరిలో పగటి కర్ఫ్యూను విధించారు. మధ్యాహ్నం 12 గంటలకే దుకాణాలను మూయించి రోడ్లపై జనసంచారం లేకుండా నియత్రించారు. రోడ్లపై జనం సంచరిస్తే కేసులు బనాయిస్తామని హెచ్చరించడంతో మెయిన్ బజారు జన సంచారంలేక వెలవెలబోయింది. కార్యక్రమంలో ఏఎ్సఐలు సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.