38 మందికి కరోనా పరీక్షలు
ABN , First Publish Date - 2021-05-06T04:13:07+05:30 IST
స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం 25 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్ నమోదైనట్లు కొవిడ్ సెంటర్ ఇన్చార్జి సుభానీ బాషా

ఉదయగిరి, మే 5 : స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం 25 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్ నమోదైనట్లు కొవిడ్ సెంటర్ ఇన్చార్జి సుభానీ బాషా తెలిపారు. అలాగే గండిపాళెం పీహెచ్సీలో 61 మందికి రెండో డోసు కరోనా వ్యాక్సిన్ వేసినట్లు చెప్పారు. ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాల పాతభవనాల్లో 13 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు సూపర్వైజర్ అక్బర్బాషా చెప్పారు. మండలంలో 13 పాజిటివ్ కేసుల్లో ఉదయగిరి 10, కొండాయిపాళెం ఒకటి, దాసరుపల్లి రెండు కేసులు నమోదైనట్లు చెప్పారు.