కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలందించండి
ABN , First Publish Date - 2021-05-11T05:08:53+05:30 IST
కొవిడ్ నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టడంతో పాటు కరోనా బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ కేవీఎన్ చక్రధర్బాబును సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశించారు.
కలెక్టర్కు సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశం
నెల్లూరు, మే 10 (ఆంధ్రజ్యోతి) : కొవిడ్ నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టడంతో పాటు కరోనా బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ కేవీఎన్ చక్రధర్బాబును సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ముఖ్యమంత్రిని కలిశారు. సుమారు అర్ధగంటపాటు సమావేశమై జిల్లా పరిస్థితులను ఆయనకు వివరించారు. ఆసుపత్రుల్లో మేనేజ్మెంట్, వ్యాక్సినేషన్ ప్రక్రియ, ఆక్సిజన్ సరఫరా వంటి విషయాలను కలెక్టర్ సీఎంకు వివరించారు. జిల్లాలో చేపడుతున్న చర్యలపై సంతృప్తి చెందిన ముఖ్యమంత్రి కలెక్టర్ను అభినందించారు. తిరుపతి ఉప ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినందుకు ప్రశంసించారు. జిల్లాలో సంక్షేమ పథకాల అమలుపై సంతృప్తి చెందిన జగన్మోహన్రెడ్డి కలెక్టర్ చక్రధర్బాబును ప్రత్యేకంగా అభినందించారు. సంక్షేమ పథకాలు ప్రతి లబ్ధిదారుడికి అందేలా కృషి చేయాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు.