బీఎస్పీ నేత మాలకొండయ్య మృతి
ABN , First Publish Date - 2021-05-03T04:38:02+05:30 IST
నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) నాయకుడు మందల మాలకొండయ్య మృతిచెందారు. ఆయన మృతి పట్ల పలు పార్టీల నేతలు నివాళులర్పించి
![బీఎస్పీ నేత మాలకొండయ్య మృతి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఆత్మకూరు, మే 2 : నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) నాయకుడు మందల మాలకొండయ్య మృతిచెందారు. ఆయన మృతి పట్ల పలు పార్టీల నేతలు నివాళులర్పించి ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గూటూరు మురళీకన్నబాబు మాట్లాడుతూ బహుజనుల అభివృద్ధి కోసం ఎనలేని సేవలం దించిన మాలకొండయ్య మృతి తీరనిలోటని వారి కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేశారు.