భాదిత కుటుంబాలకు అండగా టీడీపీ
ABN , First Publish Date - 2021-12-31T04:22:49+05:30 IST
పంబలేరువాగులో మృతి చెందిన యువకుల కుటుంబ సభ్యులకు టీడీపీ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్కుమార్ తెలిపారు.
![భాదిత కుటుంబాలకు అండగా టీడీపీ](https://media.andhrajyothy.com/appimg/galleries/1921123010510134/12302021225223n16.gif)
గూడూరు, డిసెంబరు 30: పంబలేరువాగులో మృతి చెందిన యువకుల కుటుంబ సభ్యులకు టీడీపీ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్కుమార్ తెలిపారు. గురువారం మండలంలోని పోటుపాళెంలో ఇటీవల మృతిచెందిన ఇద్దరు యువకుల కుటుంబసభ్యులను పరామర్శించి రూ. 10 వేలు ఆర్థికసాయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామానికి చెందిన భగవాన్, పవన్ అనే యువకులు పొలానికి వెళ్లేందుకు పంబలేరు వాగు దాటుతూ మృతిచెందడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో నెలబల్లి భాస్కర్రెడ్డి, బిల్లు చెంచురామయ్య, కొండూరు వెంకటేశ్వర్లురాజు, చంద్రమౌళి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.