ఐటీఐలో దరఖాస్తులకు ఆహ్వానం
ABN , First Publish Date - 2021-11-06T04:06:49+05:30 IST
స్థానిక ప్రభుత్వ ఐటీఐలో 2021-22 విద్యాసంవత్సరంలో మిగిలి ఉన్న సీట్లకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చునని ఐటీఐ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీరాములు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

గూడూరు, నవంబరు 5: స్థానిక ప్రభుత్వ ఐటీఐలో 2021-22 విద్యాసంవత్సరంలో మిగిలి ఉన్న సీట్లకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చునని ఐటీఐ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీరాములు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్, మోటార్మెకానిక్వెహికల్, సైటిఫిక్గ్లాస్ ట్రేడ్లకు నాలుగోవిడత దరఖాస్తులు చేసుకోవచ్చునని తెలిపారు. ఈనెల 13 వరకు అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవాలని తెలిపారు. 14న స్థానిక ఐటీఐకి ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకువచ్చి వెరిపికేషన్ చేయించుకోవాలని కోరారు. ఎంపికైన వారు ఈనెల 17న తరగతులకు హాజరుకావాలని సూచించారు. వివరాలకు 9676131907ను సంప్రదించాలని తెలిపారు.