ఏపీలో పెరిగిపోతున్న ఓటీఎస్ ఆగడాలు.. గురవయ్య అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం..
ABN , First Publish Date - 2021-12-12T18:07:33+05:30 IST
నెల్లూరు జిల్లా: ఏపీలో ఓటీఎస్ ఆగడాలు పెరిగిపోతున్నాయి.
నెల్లూరు జిల్లా: ఏపీలో ఓటీఎస్ ఆగడాలు పెరిగిపోతున్నాయి. నెల్లూరు జిల్లా, వరికుంటపాడు మండలం, తూర్పుకొండారెడ్డి పల్లెకు చెందిన గురవయ్యకు ఓటీఎస్ కట్టాలంటూ వాలంటీర్లు ఒత్తిడి చేశారు. ఓటీఎస్ కట్టకపోతే ఇల్లు ఖాళీ చేయాలని, పథకాలు కూడా రావని వాలంటీర్ హెచ్చరించడంతో మనస్తాపం చెందిన గురవయ్య పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గత రెండు రోజులుగా వాలంటీర్ వేధిస్తున్నాడని గురవయ్య సచివాలయ సెక్రటరీని కలిసి మొరపెట్టుకున్నాడు. ఆ తర్వాత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు గురవయ్య భార్య లక్ష్మమ్మ తెలిపింది. విషయం తెలుసుకున్న బంధువులు చికిత్స నిమిత్తం గురవయ్యను ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమం కావడంతో అక్కడి నుంచి ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.