డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలి

ABN , First Publish Date - 2021-11-03T04:07:49+05:30 IST

రబీ సాగుకు అవసరమైన వరి విత్తనాలను ధృవీకృత డీలర్ల వద్దే కొనుగోలు చేసి రశీదు పొందాలని కావలి వ్యవసాయశాఖ ఏడీఏ కన్నయ్య సూచంచారు.

డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలి
ఆర్‌బీకేలో ఎరువులను పరిశీలిస్తున్న ఏడీఏ కన్నయ్య, ఏవో లలిత

ఎంటీయూ 1010 రకం వరి సాగు చేయొద్దు

అల్లూరు, నవంబరు 2 : రబీ సాగుకు అవసరమైన వరి విత్తనాలను ధృవీకృత డీలర్ల వద్దే కొనుగోలు చేసి రశీదు పొందాలని కావలి వ్యవసాయశాఖ ఏడీఏ కన్నయ్య సూచంచారు. ఆయన మంగళవారం స్థానిక వ్యవసాయాధికారి లలితతో కలసి ఆర్‌బీకేల్లో విత్తనాలు, ఎరువులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎక్కడపడితే అక్కడ విత్తనాలు కొనుగోలు చేయకుండా జాగ్రత్త వహించాలన్నారు. మొలక 80 శాతం ఉంటేనే నార్లు పోసుకోవాలన్నారు. బీపీటీ 5204, ఎన్‌ఎల్‌ఆర్‌ 34449 రకాలతోపాటు ఎన్‌ఎల్‌ఆర్‌-145, ఎన్‌ఎల్‌ఆర్‌ర్‌-, ఎన్‌ఎల్‌ఆర్‌-4001 వేసుకోవచ్చన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంటీయూ 1010 రకం వరిని ప్రభుత్వం కొనుగోలు చేయదని, రైతులు ఆ రకం విత్తం సాగు చేసి ఇబ్బందులు పడవద్దన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో ద్వారా బీపీటీ 5204 రకం 230 క్వింటాళ్లు, ఎన్‌ఎల్‌ఆర్‌ 34449 రకం 50 క్వింటాళ్లు, ఆర్‌ఎన్‌ఆర్‌ 1504 రకం 46 క్వింటాళ్లు అందుబాటులో ఉంచామన్నారు.


Updated Date - 2021-11-03T04:07:49+05:30 IST