జేఈఈ-మెయిన్స్‌ ప్రశాంతం

ABN , First Publish Date - 2021-02-24T05:56:58+05:30 IST

బీటెక్‌, బీఆర్క్‌, బి ప్లానింగ్‌ కోర్సులలో ప్రవేశాల కోసం జేఈఈ-మెయిన్స్‌ తొలి విడత ఆన్‌లైన్‌ పరీక్షలు మంగళవారం మొదలయ్యాయి.

జేఈఈ-మెయిన్స్‌ ప్రశాంతం

కర్నూలు(ఎడ్యుకేషన్‌), ఫిబ్రవరి 23: బీటెక్‌, బీఆర్క్‌, బి ప్లానింగ్‌ కోర్సులలో ప్రవేశాల కోసం జేఈఈ-మెయిన్స్‌ తొలి విడత ఆన్‌లైన్‌ పరీక్షలు మంగళవారం మొదలయ్యాయి. మొదటిరోజు నందికొట్కూరు రోడ్డులోని ఐయాన్‌ డిజిటల్‌ సెంటర్‌లో బీఆర్క్‌, బీప్లానింగ్‌ కోర్సులకు ప్రవేశ పరీక్ష జరిగింది. ఈ పరీక్ష మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు కొనసాగింది. కేంద్రానికి 2 గంటల ముందే విద్యార్థులు చేరుకున్నారు. నిర్వాహకులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి కేంద్రాల్లోకి అనుమతించారు.

Updated Date - 2021-02-24T05:56:58+05:30 IST