‘మత్స్యకారులకు ప్రభుత్వం పెద్దపీట’

ABN , First Publish Date - 2021-11-22T05:23:14+05:30 IST

మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కర్నూలు మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ బీవై రామయ్య అన్నారు.

‘మత్స్యకారులకు ప్రభుత్వం పెద్దపీట’

కర్నూలు(అగ్రికల్చర్‌), నవంబరు 21: మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కర్నూలు మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ బీవై రామయ్య అన్నారు. ఆదివారం ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్బంగా కర్నూలు నగరంలోని సునయన ఆడిటోరియంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మేయర్‌ బీవై రామయ్యతో పాటు జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారీయాతో పాటు వివిద విభాగాల జిల్లా అధికారులు, జిల్లాలోని మత్స్యకార సహకార సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. బెస్త కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ సుధారాణి, డైరెక్టర్లు, మత్స్యశాఖ డీడీ మోహన్‌, ఏడీ సంధ్యారాణి, ఎఫ్‌డీవో కిరణ్‌ కుమార్‌తో పాటు మత్స్యశాఖ సిబ్బంది, జాతీయ మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసులు, గంగపుత్ర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మద్దిలేటి, మత్స్యకార సంక్షేమ సమితి అధ్యక్షుడు సుభాష్‌ చంద్రబోస్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-11-22T05:23:14+05:30 IST