‘క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తాం’
ABN , First Publish Date - 2021-11-10T04:28:49+05:30 IST
పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలు కళాశాల్లోని క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తామని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ డీఈ రంగయ్య తెలిపారు.
![‘క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తాం’](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
నందికొట్కూరు, నవంబరు 9: పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలు కళాశాల్లోని క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తామని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ డీఈ రంగయ్య తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్న పాఠశాల, జూనియర్ కళాశాలలోని క్రీడా మైదానాన్ని మంగళవారం సీఈవో నాగరాజనాయుడుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థులు క్రీడల్లో నేపుణఅయం కనబరుస్తున్నారని, మైదానంలో సరైన వసుతులు లేక వారు అనే ఇబ్బందులు పడుతున్నారన్నారు. క్రీడా మైదానాలను అభివృద్ధి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపాల్, పిజికల్ డైరెక్టర్ వీరన్న పాల్గొన్నారు.