‘అర్హులకు అన్యాయం చేశారు’
ABN , First Publish Date - 2021-04-13T05:32:57+05:30 IST
అర్హులైన వార్డు వలంటీర్లకు పురస్కారాల్లో అన్యాయం చేశారని వలంటీర్లు అల్తాఫ్, శంకర్నాయక్, రాఘవేంద్ర సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు.
హొళగుంద, ఏప్రిల్ 12: అర్హులైన వార్డు వలంటీర్లకు పురస్కారాల్లో అన్యాయం చేశారని వలంటీర్లు అల్తాఫ్, శంకర్నాయక్, రాఘవేంద్ర సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. సమయపాలన పాటించని, అందుబాటులో లేని వారికి పురస్కారాలు ఇచ్చారని ఆరో పించారు. ఈవోఆర్డీ సుబ్బరాయుడిని వివరణ కోరగా ఉన్నతాధికారులు సీపీఎంఎస్లో ప్రతిభ ఆధారంగా పురస్కారాలు మంజూరు చేశారని, ఎంపీడీవోకు గాని రాజకీయ నాయకులకు గాని సంబంధం లేదన్నారు.