ఎయిర్పోర్టుకు ఉయ్యాలవాడ పేరు ఖరారు
ABN , First Publish Date - 2021-05-17T05:44:47+05:30 IST
ఓర్వకల్లు సమీపంలోని కర్నూలు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును ఖరారు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదివారం జీవో జారీ చేసింది.
ఓర్వకల్లు, మే 16: ఓర్వకల్లు సమీపంలోని కర్నూలు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును ఖరారు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదివారం జీవో జారీ చేసింది. విమానాశ్రయాన్ని ప్రారంభించే సమయంలో, జిల్లా ప్రజల కోరిక మేరకు సీఎం వైఎస్ జగన్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెడతామని ప్రకటించారు. హామీ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది.