కళాకారుడు రామకృష్ణారెడ్డికి నివాళి

ABN , First Publish Date - 2021-05-09T04:50:04+05:30 IST

కర్నూలుకు తొలి నంది అవార్డు తీసుకువచ్చిన రంగస్థల కళాకారుడు, విశ్వకళాసమితి మాజీ అధ్యక్షుడు దివంగత కొండా రామకృష్ణారెడ్డికి రంగస్థల కళాకారులు నివాళి అర్పించారు.

కళాకారుడు రామకృష్ణారెడ్డికి నివాళి

కర్నూలు(కల్చరల్‌), మే 8: కర్నూలుకు తొలి నంది అవార్డు తీసుకువచ్చిన రంగస్థల కళాకారుడు, విశ్వకళాసమితి మాజీ అధ్యక్షుడు దివంగత కొండా రామకృష్ణారెడ్డికి రంగస్థల కళాకారులు నివాళి అర్పించారు. శనివారం స్థానిక మార్కెట్‌ యార్డులోని విశ్వకళా సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సమితి అధ్యక్షుడు గాండ్ల లక్ష్మన్న, కన్వీనర్‌ పి.హనుమంతరావు చౌదరి, ఇతర కళాకారులు నివాళి అర్పించారు. గాండ్ల లక్ష్మన్న మాట్లాడుతూ నంది అవార్డులు ప్రవేశ పెట్టిన తొలి ఏడాదే కర్నూలుకు తొలి నంది అవార్డు రామకృషా ్ణరెడ్డికి దక్కిందని కొనియాడారు. హనుమంతరావు చౌదరి మాట్లాడుతూ సుమారు మూడు దశాబ్దాలకు పైగా జిల్లా నాటక రంగానికి రామకృష్ణారెడ్డి ఎనలేని సేవలు చేశారని స్లాగించారు. కార్యక్రమంలో కార్యదర్శి ఇ.నాగరాజు, కళాకారులు పీజీ వెంకటేశ్వర్లు, నాయుడు, భీసన్న, ఆచారి, టీసీ కేశన్న, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-09T04:50:04+05:30 IST