రేపటి నుంచి కంబగిరిస్వామి బ్రహ్మోత్సవాలు
ABN , First Publish Date - 2021-04-22T05:43:06+05:30 IST
ఎర్రమల కొండల్లో వెలసిన లక్ష్మీ కంబగిరిస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 23నుంచి 28వతేదీ వరకు జరుగనున్నాయని పర్యవేక్షకుడు చల్లా సూర్యప్రకా్షరెడ్డి, ఆలయ ఈవో డీఆర్కే ప్రసాద్ తెలిపారు.
అవుకు, ఏప్రిల్ 21: ఎర్రమల కొండల్లో వెలసిన లక్ష్మీ కంబగిరిస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 23నుంచి 28వతేదీ వరకు జరుగనున్నాయని పర్యవేక్షకుడు చల్లా సూర్యప్రకా్షరెడ్డి, ఆలయ ఈవో డీఆర్కే ప్రసాద్ తెలిపారు. 23వతేదీన అంకురార్పణ, ధ్వజారోహణ, దీక్షా ప్రారంభం, శ్రీవారు కొండపైకి వెళ్లడం, 24న హనుమద్వాహనం, 25న గరుడవాహనం, 26న గజవాహనం, పర్శ, రాయబారం, 27న ఉద యం కల్యాణం, సాయంత్రం రఽథోత్స వం, 28వతేదీన ఉదయం పూర్ణాహుతి, వసంతోత్సవం, సాయంత్రం పారువేట, రాత్రి గ్రామోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బనగానపల్లె నుంచి పసుపల, గార్లదిన్నె, రాచర్ల మీదుగా బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.