అమ్మవారి ఆభరణాలు చోరీ

ABN , First Publish Date - 2021-10-08T04:58:01+05:30 IST

పట్టణంలోని కిల్చిన్‌పేట అంబా భవాని దేవాలయంలో అమ్మవారి ఆభరణాలు చోరీకి గురయ్యాయి.

అమ్మవారి ఆభరణాలు చోరీ

ఆదోని, అక్టోబరు 7: పట్టణంలోని కిల్చిన్‌పేట అంబా భవాని దేవాలయంలో అమ్మవారి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ నెల 3న గుర్తు తెలియని యువకుడు ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారికి అలంకరించిన బంగారు నగలు, తాళిబొట్టును తస్కరించాడు. ఎత్తుకెళ్లాడు. ఇదంతా ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఆలయ కమిటీ నిర్వాహకులు ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రశేఖర్‌ తెలిపారు. 

Updated Date - 2021-10-08T04:58:01+05:30 IST