వైసీపీకి పతనం తప్పదు
ABN , First Publish Date - 2021-12-04T04:31:07+05:30 IST
రాష్ట్రంలో వైసీపీ దుర్మార్గపాలనకు పతనం తప్పదని మాజీ శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన వంగాల శివరామిరెడ్డి, ఆత్మకూరు మాజీ సర్పంచ గోవిందరెడ్డి పేర్కొన్నారు.
ఆత్మకూరురూరల్, డిసెంబరు 3: రాష్ట్రంలో వైసీపీ దుర్మార్గపాలనకు పతనం తప్పదని మాజీ శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన వంగాల శివరామిరెడ్డి, ఆత్మకూరు మాజీ సర్పంచ గోవిందరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆత్మకూరు మండలంలోని ముష్టెపల్లి గ్రామంలో ఆడపడుచుల ఆత్మగౌరవం కోసం గౌరవ సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చేశారని అన్నారు. దీనివల్ల భవిష్యత తరాలకు తీవ్ర నష్టం వాటిల్లనుందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన అరాచక పాలనను ప్రజలు గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా బుద్ధిచెప్పడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మహిళలపై నిందలతో దూషణలు చేయడం బాధాకరమని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గిరిరాజు, శివప్రసాద్ రెడ్డి, పుల్లారెడ్డి, ఫకృద్ద్దీన, పస్పిల్మున్నా, ముస్తఫా, రామ్మూర్తి, ముష్టపల్లి గ్రామ నాయకులు వెంకటరాముడు, నరసయ్య, కృష్ణ, వినోద్, రాజశేఖర్ పాల్గొన్నారు.
ఆత్మగౌరవం నిలుపుదాం
బండి ఆత్మకూరు: రాష్ట్రంలో ఆడపడచుల ఆత్మగౌరవం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మండల టీడీపీ నాయకులు నరసింహారెడ్డి, మల్లేశ్వరరెడ్డి, జాకీర్, సిద్దయ్య సూచించారు. శుక్రవారం సాయంత్రం మండలంలోని పెద్దదేవళాపురం గ్రామంలో గౌరవసభ కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ పదిహేను రోజుల క్రితం అసెంబ్లీ సమావేశాల్లో మాజీ సీఎం చద్రబాబు నాయుడు సతీమణిపైనే వైసీపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. తెలుగింటి ఆడపడచుల ఆత్మగౌరవం నందమూరి ప్రపంచానికే చాటారని, నేడు ఆయన కూతురిపైనే వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. స్థానిక నాయకులు సర్పంచ పెద్దన్న, వీరారెడ్డి, ప్రసాద్, కృష్ణారెడ్డి, రామలింగం, రంగస్వామి పాల్గొన్నారు.