బావిలో పడి వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-06-24T04:55:56+05:30 IST
ప్రమాదవశాత్తు బావిలో జారి పడి ఓ వ్యక్తి మృతి చెందాడు.
పత్తికొండరూరల్, జూన్ 23: ప్రమాదవశాత్తు బావిలో జారి పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని హోసూరు గ్రామానికి చెందిన సుధాకర్ (42) హైదరాబాద్లో ఉంటున్నారు. బంధువులు ఒకరు మృతి చెందడంతో అంత్యక్రియల కోసం గ్రామానికి వచ్చాడు. బుధవారం శ్మశానానికి వెళ్లాడు. అంత్యక్రియల అనంతరం పక్కనే ఉన్న బావిలోకి స్నానం చేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తుకాలు జారి పడి మృతి చెందాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు తెలపడంతో మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.