గాయపడిన మహిళ మృతి
ABN , First Publish Date - 2021-11-03T05:26:43+05:30 IST
ఎమ్మిగనూరు నుంచి మంత్రాలయానికి బైక్ మీద వెళుతుండగా ప్రమాదానికి గురై గాయపడిన చెందిన హుసేన్బీ (32) కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక మంగళవారం మృతి చెందింది.
మంత్రాలయం, నవంబరు 2: ఎమ్మిగనూరు నుంచి మంత్రాలయానికి బైక్ మీద వెళుతుండగా ప్రమాదానికి గురై గాయపడిన చెందిన హుసేన్బీ (32) కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక మంగళవారం మృతి చెందింది. సోమవారం భర్త బడేసాబ్ తన భార్య హుసేన్బీతో మోటార్సైకిల్పై మంత్రాలయం వెళుతుండగా చిలకలడోన దగ్గర ఈ ఘటన జరిగింది. హుసేన్బీ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మంత్రాలయం ఎస్ఐ వేణుగోపాల్ రాజు తెలిపారు.