కలెక్టర్కు జీజీహెచ్లో వైద్య పరీక్షలు
ABN , First Publish Date - 2021-05-17T05:29:16+05:30 IST
కలెక్టర్ వీర పాండియన్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు.
కర్నూలు(కలెక్టరేట్), మే 16: కలెక్టర్ వీర పాండియన్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. కలెక్టర్కు ఈ నెల 12న కొవిడ్ పాజిటివ్గా తేలింది. 13న రాత్రి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. దీంతో వైద్యుల సలహా మేరకు ప్రతిరోజు జీజీహెచ్లోని పేయింగ్ బ్లాక్లో వైద్యం చేయించుకుంటున్నారు. అందులో భాగంగా ఆదివారం సాయంత్రం జీజీహెచ్కు వెళ్లారు. అక్కడ ఆక్సిజన్ లెవెల్ శాతం, తదితర పరీక్షలు చేయించుకున్నట్లు వైద్యులు తెలిపారు.