టీడీపీ కార్యకర్త బైకుకు..
ABN , First Publish Date - 2021-01-14T05:09:46+05:30 IST
బనగానపల్లె పట్టణంలో పట్టపగలు అందరూ చూస్తుండగానే టీడీపీ కార్యకర్త హర్షద్ మోటారుసైకిల్ను గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం పెట్రోల్పోసి నిప్పంటించారు.
![టీడీపీ కార్యకర్త బైకుకు..](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
బనగానపల్లె , జనవరి 13: బనగానపల్లె పట్టణంలో పట్టపగలు అందరూ చూస్తుండగానే టీడీపీ కార్యకర్త హర్షద్ మోటారుసైకిల్ను గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం పెట్రోల్పోసి నిప్పంటించారు. చుట్టుపక్కల వారు గమనించి మంటలను ఆర్పివేశారు. దీంతో పాక్షికంగా మోటారు సైకిల్ దెబ్బతింది. హర్షద్ బనగానపల్లె పోలీ్సస్టేషన్ల్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.