ఆ చట్టాలు సరికాదు

ABN , First Publish Date - 2021-01-20T05:38:42+05:30 IST

వ్యవసాయ రంగానికి తూట్లు పొడుస్తూ, రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించే వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్‌, టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు.

ఆ చట్టాలు సరికాదు
నంద్యాలలో దీక్షను విరమింపజేస్తున్న ఏవీ సుబ్బారెడ్డి


  1.  ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్‌, టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి

నంద్యాల, జనవరి 19: వ్యవసాయ రంగానికి తూట్లు పొడుస్తూ, రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించే వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్‌, టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం నంద్యాలలో రెండో రోజు ఆవాజ్‌ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలో రైతుల ఆందోళనలకు మద్దతుగా రిలే నిరాహార దీక్ష చేపట్టారు. పట్టణ ఆవాజ్‌ కమిటీ అధ్యక్షుడు ఎస్‌ఏ బాబుల్లా తదితరులు దీక్షలో కూర్చున్నారు. సాయంత్రం ఏవీ సుబ్బారెడ్డి హాజరై నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అన్యాయం చేస్తే దేశాభివృద్ధి కుంటుపడుతుందన్నారు. వ్యవసాయ రంగానికి మరింత అండగా సంక్షేమ పథకాలు చేపట్టాల్సిన ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకు రావడం సరికాదన్నారు. నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీలో రోజుల తరబడి రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఆవాజ్‌, వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-20T05:38:42+05:30 IST