శాస్త్రవేత్తకు ప్రతిభా పురస్కారం

ABN , First Publish Date - 2021-08-11T04:48:24+05:30 IST

మహానంది ఆచార్య ఎన జిరంగా వ్యవసాయకళాశాలకు చెందిన అగ్రానమి శాస్త్రవేత్త మల్లు శ్రీనివాసరెడ్డికి వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉత్తమ శాస్త్రవేత్తగా ప్రతిభా పురస్కారం(మెరిటరైజ్‌ టీచర్‌ అవార్డు) అందుకున్నట్లు కళాశాల ఆసోసియేట్‌ డీన డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.

శాస్త్రవేత్తకు ప్రతిభా పురస్కారం

మహానంది,  ఆగస్టు 9: మహానంది ఆచార్య ఎన జిరంగా  వ్యవసాయకళాశాలకు చెందిన అగ్రానమి శాస్త్రవేత్త మల్లు శ్రీనివాసరెడ్డికి  వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉత్తమ శాస్త్రవేత్తగా ప్రతిభా పురస్కారం(మెరిటరైజ్‌ టీచర్‌ అవార్డు)  అందుకున్నట్లు కళాశాల ఆసోసియేట్‌ డీన డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం తిరుపతి మహాతి ఆడిటోరియంలో  వ్యవసాయ విశ్వవిద్యాలయం 50 వ స్నాతకోత్సవం జరిగింది. ఈవేదికలో రాష్టంలోని వ్యవసాయకళాశాలలో ప్రతిభ కనపర్చిన శాస్త్రవేత్తలకు అవార్డులను విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రకటించారు. ఇందులో భాగంగా మహానంది వ్యవసాయ కళాశాలలో అగ్రానమి శాస్త్రవేత్త మల్లు శ్రీనివాసరెడ్డి ప్రతిభా పురష్కారానికి ఎంపికయ్యారు. ఉవకులపతి డాక్టర్‌ ఆదాల విష్ణువర్దనరెడ్డి చేతుల మీదుగా శ్రీనివాసరెడ్డి అవార్డు అందుకున్నట్లు చెప్పారు. తమ కళాశాలకు చెందిన శాస్త్రవేత్త ఈపురష్కారం అందుకోవడంపై కళాశాల శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు.


Updated Date - 2021-08-11T04:48:24+05:30 IST