కరోనా కట్టడికి సహకరించాలి
ABN , First Publish Date - 2021-05-21T05:40:14+05:30 IST
కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని నం ద్యాల సబ్ కలెక్టర్ కల్పనాకుమారి పేర్కొన్నారు.

- నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనాకుమారి
కోవెలకుంట్ల, మే 20: కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని నం ద్యాల సబ్ కలెక్టర్ కల్పనాకుమారి పేర్కొన్నారు. గురువారం కోవెలకుంట్లలో అమలులో ఉన్న కర్ఫ్యూను తహసీల్దారు పుష్పకుమారి, ఎంపీడీవో మహబూబ్దౌలతో కలిసి పరిశీలించారు. అనంతరం సబ్ కలెక్టర్ కల్పనాకుమారి మాట్లాడుతూ అందరూ కలిసి కట్టుగా కరోనాను కట్టడి చేయాలన్నారు. ప్రజలంతా కర్ఫ్యూకు సహకరించాలని, ప్రభుత్వం, అధికారుల సూచనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దారు చంద్రశేఖర్, ఆర్ఐ ఇమ్రాన్, రెవెన్యూ సిబ్బంది, ఎస్ఐ చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు.
ఆళ్లగడ్డ: కర్ఫూను కఠినంగా అమలు చేయాలని నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనాకుమారి అధికారులను ఆదేశించారు. పట్టణంలో ఆమె గురువారం కలియతిరిగారు. పట్టణంలో కర్ఫ్యూ సమయం ముగిసిన తరువాత దుకాణాలను తెరిచిన యజమానులకు జరిమానా విధించాలని మున్సిపాల్టీ అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు 6 దుకాణాల యజమానుల నుంచి రూ.2,200 వసూలు చేశారు. ఆమె వెంట పట్టణ సీఐ కృష్ణయ్య, కమిషనర్ కిశోర్, ఎంపీడీవో అక్రమ్బాషా, డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్ ఉన్నారు.