ఘనంగా స్వాతి వేడుకలు
ABN , First Publish Date - 2021-11-05T05:30:00+05:30 IST
అహోబిలం శ్రీలక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి వేడుకలను వేదపండితులు గురువారం ఘనంగా నిర్వహించారు.

ఆళ్లగడ్డ, నవంబరు 5: అహోబిలం శ్రీలక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి వేడుకలను వేదపండితులు గురువారం ఘనంగా నిర్వహించారు. అద్దాల మండపం నుంచి వేదశాలకు ఉత్సవమూర్తులను తీసుకొచ్చి అక్కడ పూజలు నిర్వహించిన అనంతరం భక్తుల మధ్య స్వాతి సుదర్శన హోమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డి దంపతులు, ఎమ్మెల్యే బిజేంద్రనాధరెడ్డి పాల్గొన్నారు.
నంద్యాల(కల్చరల్): స్థానిక తెలుగుపేటలో వెలసిన లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి సంద ర్భంగా అర్చకుడు శ్రీరామమూర్తి పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు మధు పాల్గొన్నారు.