స్పందన అర్జీలను పరిష్కరించండి: ఆర్డీవో
ABN , First Publish Date - 2021-10-26T05:14:31+05:30 IST
స్పందనలో వచ్చిన అర్జీలను ఎప్పటి కప్పుడు పరిష్కరించి బాధితులకు సత్వరమే న్యాయం అందించాలని ఆర్డీవో రామకృష్ణారెడ్డి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు.

ఆదోని, అక్టోబరు, 25: స్పందనలో వచ్చిన అర్జీలను ఎప్పటి కప్పుడు పరిష్కరించి బాధితులకు సత్వరమే న్యాయం అందించాలని ఆర్డీవో రామకృష్ణారెడ్డి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 17 మండలాల నుంచి బాధితులు ఇచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అర్జీలు ఇచ్చిన బాధితుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
వచ్చిన అర్జీలు
నందవరం గ్రామానికి చెందిన జయరాముడు అనే రైతు తన పొలాన్ని ఆన్లైన్ ఎంట్రీ చేయాలని కోరారు.
దేవనకొండ మండలం కుంకనూరు గ్రామానికి చెందిన రీనా బాషా అనే రైతు తన పొలం సర్వే చేయించాలని దరఖాస్తు చేశారు.
ఆదోని పట్టణం ఎన్జీవో కాలనీకి చెందిన యశోద తన ఇంటికి పట్టా ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంంలో మున్సిపల్ కమిషనర్ ఆర్జీవీ కృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.