పంట రుణాలు అందించండి
ABN , First Publish Date - 2021-04-13T05:11:54+05:30 IST
నష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ముందుండి విరివిరిగా రుణాలు అందించాలని జాయింట్ కలెక్టర్, సహకార కేంద్ర బ్యాంకు పర్సన్ ఇన్చార్జి రాంసుందర్ రెడ్డి ఆదేశించారు.
జేసీ ఆదేశం
కర్నూలు (అగ్రికల్చర్), ఏప్రిల్ 12: నష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ముందుండి విరివిరిగా రుణాలు అందించాలని జాయింట్ కలెక్టర్, సహకార కేంద్ర బ్యాంకు పర్సన్ ఇన్చార్జి రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. సోమవారం ఒక ప్రకటనలో మాట్లాడుతూ బ్యాంకు ద్వారా రైతులకు అవసరమైన రుణాలు అందించడంలో ఎటువంటి జాప్యం ఉండకూడదన్నారు. 2021 సంవత్సరం ముగిసేనాటికి డీసీసీబీ వ్యాపారం రూ.2,500 కోట్లకు విస్తరింపజేసే లక్ష్యంతో ఉన్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇప్పటికే రూ.2,200 కోట్ల వ్యాపారానికి చేరుకున్నామని, లక్ష్యాన్ని అధికమించేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు.