పీజీ ఫలితాలు విడుదల
ABN , First Publish Date - 2021-12-05T05:21:42+05:30 IST
రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో మార్చి/ఏప్రిల్లో జరిగిన పీజీ 3, 5వ సెమిస్టర్ ఫలితాలను ఉపకులపతి ఎ.ఆనందరావు విడుదల చేశారు.
కర్నూలు(అర్బన్), డిసెంబరు 4: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో మార్చి/ఏప్రిల్లో జరిగిన పీజీ 3, 5వ సెమిస్టర్ ఫలితాలను ఉపకులపతి ఎ.ఆనందరావు విడుదల చేశారు. ఈ పరీక్షలకు 1,857 మంది విద్యార్థులు హాజరు కాగా 1,513 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. వివరాల కోసం యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్లో చూసుకోవాలని, లేదంటే ఆయా కళాశాల ప్రిన్సిపాళ్ల వద్ద అందుబాటులో ఉంటాయని పరీక్షల విభాగం అధికారులు తెలిపారు.