వ్యాక్సిన్పై అపోహలు వద్దు
ABN , First Publish Date - 2021-01-22T05:56:48+05:30 IST
కొవిడ్ వ్యాక్సిన్పై అపోహలు వద్దని, తాను టీకా తీసుకున్నాక మరింత ఉత్సాహంగా పని చేశానని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెండ్ డా.నరేంద్రనాథ్ రెడ్డి అన్నారు.
- పెద్దాసుపత్రి సూపరింటెండెంట్డా.నరేంద్రనాథ్ రెడ్డి
కర్నూలు(హాస్పిటల్), జనవరి 21: కొవిడ్ వ్యాక్సిన్పై అపోహలు వద్దని, తాను టీకా తీసుకున్నాక మరింత ఉత్సాహంగా పని చేశానని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెండ్ డా.నరేంద్రనాథ్ రెడ్డి అన్నారు. గురువారం ఆసుపత్రిలోని పాత గైనిక్ వార్డులోని వ్యాక్సిన్ సెం టర్లో ఆయన టీకా వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని వెల్లడించారు. వ్యాక్సినేషన్కు పూర్తి ఏర్పాట్లు ఆసుపత్రిలో చేశామని, వైద్యులు, సిబ్బంది ఉత్సాహంగా టీకా తీసుకుంటున్నారని అన్నారు.