నేతన్న నేస్తం కాదు.. నేతన్నకు మోసం

ABN , First Publish Date - 2021-08-11T05:19:18+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం నేతన్న నేస్తంతో పేరుతో నేతన్నను మోసం చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆరోపించారు.

నేతన్న నేస్తం కాదు.. నేతన్నకు మోసం

  1. మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ద్వజం 


ఎమ్మిగనూరు, అగస్టు10: రాష్ట్ర ప్రభుత్వం నేతన్న నేస్తంతో పేరుతో నేతన్నను మోసం చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆరోపించారు. ప్రచార ఆర్భాటం తప్ప చేనేతలను ఆదుకోవాలనే ఆశయం లేని పథకం అని విమర్శించారు. గత టీడీపీ ప్రభుత్వం కార్పొరేషన్‌ ద్వారా రూ. 2లక్షల వరకు రుణాలను పావలా వడ్డీకే ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఆదరణ పథకం ద్వారా మగ్గం మిషన్‌లను పంపిణీ చేశారని, సిల్కు కొనుగోలులో రాయితీ ఇచ్చారని అన్నారు. నేడు ఆ పథకాలు అన్నీ రద్దుచేసి కేవలం రూ.24 వేలు ఇచ్చి వైసీపీ ప్రభుత్వం చేతులు దులుపుకోవటం దారుణమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3.50లక్షలు మంది చేనేతకార్మికలు ఉంటే కేవలం 69వేల మందికి మాత్రమే పథకం వర్తింపచేయటం మోసం కాదా అని ప్రశ్నించారు. ఎమ్మిగనూరులో 5వేల మంది చేనేత కార్మికులు ఉంటే కేవలం కొందరికి మాత్రమే పథకాన్ని వర్తింపచేశారని అన్నారు. 

Updated Date - 2021-08-11T05:19:18+05:30 IST