హత్య కేసుపై దర్యాప్తు ముమ్మరం: ఎస్ఐ
ABN , First Publish Date - 2021-04-12T05:36:31+05:30 IST
మండలంలోని బ్రాహ్మణపల్లె గ్రామానికి చెందిన బోయ ఎల్లప్ప హత్య కేసుపై దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపారు.
ఓర్వకల్లు, ఏప్రిల్ 11: మండలంలోని బ్రాహ్మణపల్లె గ్రామానికి చెందిన బోయ ఎల్లప్ప హత్య కేసుపై దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శనివారం బోయ ఎల్లప్పను హత్య చేసి కాల్చచారు, వాటిపై విచారణ చేపడుతున్నామన్నారు. అలాగే సంఘటనా స్థలాన్ని డాగ్ స్క్వాడ్ క్లూజ్ టీమ్ పరిశీలించారని, పోస్టుమార్టం కూడా నిర్వహించామన్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఆయన తెలిపారు.