‘మసీదు స్థలాలను కాపాడాలి’
ABN , First Publish Date - 2021-10-17T05:17:08+05:30 IST
పట్టణ నడిబొడ్డున ఉన్న పాంచ కమాన మసీదుకు సంబంధించిన స్థలాలు ఆక్రమణకు గురయ్యాయని, కాపాడాలని ముస్లింలు కోరారు.
బనగానపల్లె, అక్టోబరు 16: పట్టణ నడిబొడ్డున ఉన్న పాంచ కమాన మసీదుకు సంబంధించిన స్థలాలు ఆక్రమణకు గురయ్యాయని, కాపాడాలని ముస్లింలు కోరారు. ఐఎంఎం ఆర్గనైజేషన, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శనివారం రెండో రోజు రిలే దీక్షలు చేపట్టారు. మసీదు ముత్తావలి షఫి మాట్లాడుతూ ఆక్రమణకు గురైన స్థలం వక్ఫ్బోర్డు, మసీదులకు సంబంధించిందని తెలిపారు. గత 20 ఏళ్లనుంచి దుకాణాలు నిర్మించుకున్న వారు అద్దెలు చెల్లించడం లేదన్నారు. ఆక్రమణలకు గురైన విషయాన్ని తహసీల్దార్కు, ఈవోఆర్డీ శివరామయ్యకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీక్షలో ముస్లిం మహిళలు, మసీదు కమిటీ సభ్యులు సర్దార్, ఇమాములు, మున్వర్, కరీముల్లా, రజాక్, సుభాణి, జానీ, అల్లాబకా్స, అబ్బా్స హుస్సేన, హసనఖాన, అలీబాషా తదితరులు పాల్గొన్నారు.