కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-11-03T05:21:58+05:30 IST

కోడుమూరు మండలం పులకుర్తి గ్రామానికి చెందిన చాకలి వీరన్న (55) అనే వ్యక్తి కుటుంబ కలహాలతో మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు.

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

మద్దికెర, నవంబరు 2: కోడుమూరు మండలం పులకుర్తి గ్రామానికి చెందిన చాకలి వీరన్న (55) అనే వ్యక్తి కుటుంబ కలహాలతో మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. పులకుర్తి గ్రామానికి చెందిన చాకలి వీరన్న అక్టోబరు 16వ తేదీన ఇంటిలో గొడవ పడి వచ్చేశాడు. అయితే మద్దికెర గ్రామ శివారులో పంచతో చెట్టుకు ఉరివేసుకున్నాడు. సమాచారం రావడంతో ఏఎస్‌ఐ షాజహాన్‌ ఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పత్తికొండకు తరలించారు. మృతి చెందిన విషయం ఫోన్‌ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.  



Updated Date - 2021-11-03T05:21:58+05:30 IST